దిల్ రాజుకి కలెక్షన్స్ ఫిదా..

దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ .. సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో మూడో వారంలోకి అడుగుపెట్టింది..ఈ మూవీకి రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.. రెండో వారంలోనే నిర్మాత దిల్ రాజు థియేటర్స్ ను కూడా పెంచారు.. దీంతో రెండు వారాల్లో రూ 32 కోట్ల రూపాయిలు షేర్ సాధించి దిల్ రాజుని ఫిదా చేసింది.. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ లో సైతం రెండు మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరువైంది.. ఇదే కలెక్షన్స్ జోరు సాగితే రూ 40 కోట్లకు మించి షేర్ రాబడుతుందని అంటున్నారు..

Comments